కాకినాడ జిల్లా తునిలో ఓ ఆలయంలో చోరీ జరిగింది. తునిలో ఉన్న తలుపులమ్మ ఆలయంలో ముగ్గురు వ్యక్తులు చొరబడి చోరీ చేశారు. ఓ యువతి, ఇద్దరు యువకులు ఆలయంలోకి ప్రవేశించి హుండీని కొల్లగొట్టారు. అందులోని సొమ్ము మొత్తం తీసుకుని అక్కడి నుంచి ఉడాయించారు. అయితే అక్కడే ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో ఈ వ్యవహారం మొత్తం రికార్డైంది. ఆలయ సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దొంగతనం చేసిన వారిని గుర్తించే పనిలో పడ్డారు. మరోవైపు ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.