ఓటరు జాబితాలో నుంచి తన పేరు తొలగించారంటూ సినీ నటుడు ప్రకాష్ రాజ్ చేస్తున్న ఆరోపణలపై ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ప్రకాష్ రాజ్ వేరే ప్రాంతానికి మారినట్లు ఫారంలో ఉందని.. ఆ విషయాన్ని ఆయన ధ్రువీకరించపోతే అధికారులు, ప్రభుత్వానికి ఎలా తెలుస్తుందన్నారు. ఈ క్రమంలోనే ప్రకాష్ రాజ్పై విమర్శలు గుప్పించిన విష్ణువర్ధన్ రెడ్డి.. సరైన ధ్రువపత్రాలు సమర్పించి ఓటును పునరుద్ధరించుకోవాలని ప్రకాష్ రాజ్కు సూచించారు.