శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ పదవికి వైసీపీ అభ్యర్థిగా తూమాటి మాధవరావు పేరును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఖరారు చేశారు. పార్టీ ఎమ్మెల్సీలంతా ఆయనకు పూర్తి మద్దతు ఇవ్వాలని.. ఎన్నిక సాఫీగా జరిగేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. బుధవారం రోజున తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్సీలతో జగన్ భేటీ జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ ఛైర్మన్ అభ్యర్థిని జగన్ ఎంపిక చేశారు.