ఆర్థిక ఇబ్బందులు, అప్పుల ఒత్తిడి కారణంగా దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. రూ.90 లక్షల ఇల్లు కొనుగోలు చేసిన దంపతులు.. అప్పుల బాధలు తట్టుకోలేక ప్రాణాలు తీసుకున్నారు. ఆ అప్పులను తీర్చేందుకు హోమ్లోన్ కోసం ప్రయత్నించినా రాకపోవడంతో చివరికి ఇంటిని అమ్మేశారు. అయినా అప్పులు తీరకపోవడంతో తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. ఈ క్రమంలోనే భర్త ఉరి వేసుకోగా.. భార్య పురుగుల మందు తాగింది. దీంతో వారి ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు.