ఓపెన్ ప్లాట్లు కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ప్రజలకు సూచించారు. ఫామ్ ల్యాండ్స్ పేరుతో కొందరు రియల్ ఎస్టేట్ మోసాలకు పాల్పడుతున్నారని.. అలాంటి భూముల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యవసాయ భూముల్లో ప్లాట్లు కొనొద్దని.. అలాంటి ప్లాట్లలో నిర్మాణాలు చేపడితే కూల్చివేతలు తప్పవని హెచ్చరించారు.