ప్యాకర్స్ అండ్ మూవర్స్ పేరిట ఇంటి సామాన్లనుతో పాటు గంజాయిని అక్రమంగా సరఫరా చేస్తున్న ముఠాను హైదరాబాద్లోని షామీర్ పేట పోలీసులు పట్టుకున్నారు. బోయిన్పల్లికి చెందిన వ్యక్తి హర్యానాకు చెందిన సాహిల్తో కలిసి 273 కిలోల గంజాయిని ఒడిషా నుంచి తెలంగాణ మీదుగా తరలించేందుకు ప్రణాళిక వేశారు. విశ్వసనీయ సమాచారం అందటంతో.. వాహనాన్ని తనిఖీ చేసి గంజాయిని పట్టుకున్నారు. ఈ కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ దాదాపు కోటి రూపాయలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.