అనకాపల్లి జిల్లా చోడవరం సబ్ జైలు నుంచి తప్పించుకునిపోయిన ఇద్దరు ఖైదీలు మళ్లీ పోలీసులకు చిక్కారు. శుక్రవారం జైలు అధికారిపై సుత్తితో దాడి చేసి పరారైన ఇద్దరు ఖైదీలు.. గంటల వ్యవధిలోనే మళ్లీ పోలీసులకు దొరికారు. చోరీ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న బెజవాడ రాము, పంచాయతీ మాజీ కార్యదర్శి నక్కా రవికుమార్ హెడ్ వార్డర్ వీర రాజుపై సుత్తితో దాడి చేసి జైలు నుంచి పరారయ్యారు. అయితే వీరి ప్లాన్ రివర్స్ కొట్టి.. టాస్క్ఫోర్స్ పోలీసులకు చిక్కారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు వీరిని అనకాపల్లి పోలీసులకు అప్పగించారు.