Chandrababu Teleconference With Leaders: ఏపీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్డీయే కూటమి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో టెలీకాన్ఫరెన్స్లో మాట్లాడారు. రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై టీడీపీ నేతలకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఇద్దరు అభ్యర్థుల గెలుపు కోసం కూటమిలోని మూడు పార్టీల నేతలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వం చేసిన మంచిని ప్రజలకు, యువతకు వివరించాలని చంద్రబాబు నాయుడు సూచనలు చేశారు.