తెలంగాణలో సోమవారం (మే 05) రోజు విచిత్ర వాతావరణం నెలకొంది. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, వడగండ్లతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కరీంనగర్, హైదరాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. ఇదే సమయంలో ఉత్తర తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించడంతో ప్రజలు భయాందోళన చెందారు. రిక్టర్ స్కేలుపై 3.8గా నమోదైంది. అటు వర్షాలు, ఇటు భూప్రకంపనలతో ఆయా ప్రాంతాల్లో ఆందోళనకర వాతావరణం నెలకొంది.