కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూముల వివాదంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఆందోళనలు చేసిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులపై కేసులు నమోదు చేయగా వాటిని ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు. మంత్రుల కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.