హైదరాబాద్లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు రేవంత్ సర్కార్ భారీ ప్రణాళికలు సిద్ధం చేసింది. కంటోన్మెంట్ ప్రాంతంలో రూ.600 కోట్లతో ఆరు కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరణతో పాటు రెండు ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టనుంది. మారేడ్పల్లి, సఫిల్గూడ మీదుగా ఆర్కేపురం వరకు కొత్త రోడ్డు వేయనుండగా, ఆర్కేపురం వద్ద రైల్ ఓవర్, అండర్ బ్రిడ్జిల నిర్మాణానికి రూ.245 కోట్లు మంజూరయ్యాయి. ఈ చర్యలతో సికింద్రాబాద్ నుంచి మల్కాజిగిరి వెళ్లేవారికి ట్రాఫిక్ సమస్యలు తొలగిపోతాయి.