వైఎస్ఆర్ కడప జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. స్టవ్ మీద పెట్టిన పాలు పొంగిపోయాయని భార్య మీద కోపంతో భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. కడపలోని బాలాజీనగర్లో ఆదివారం ఈ ఘటన జరిగింది. పాలుపొంగిపోయాయని భార్యను మందలించిన వెంకటసుబ్బయ్య.. కోపంతో గోడకు తలబాదుకున్నాడు. దీంతో గాయం కాగా.. భయపడిపోయిన భార్య ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది. ఈ సమయంలోనే వెంకటసుబ్బయ్య ఫ్యాన్కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.