కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం మరోసారి కుర్చీ వివాదంతో వాయిదా పడింది. తనకు చెప్పకుండా ఎమ్మెల్యేలకు కుర్చీలు కేటాయించడంపై మేయర్ అభ్యంతరం తెలపడంతో గందరగోళం నెలకొంది. మేయర్ సురేశ్ బాబుతో పాటు కొందరు కార్పొరేటర్లు సమావేశానికి హాజరు కాలేదు. దీనిపై స్పందించిన కమిషనర్ మనోజ్ రెడ్డి.. మేయర్ సురేశ్ బాబుకు నోటీసులు జారీ చేశారు. సిబ్బంది వచ్చి చాంబర్కు నోటీసులు అంటించి వెళ్లారు. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది.