ఏపీలో కొవిడ్ కేసు నమోదు కావటం కలకలం రేపుతోంది. విశాఖపట్నంలోని ఓ యువతికి కరోనా నిర్ధరణ అయ్యింది. అయితే ఆమె కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారని అధికారులు తెలిపారు. మరోవైపు కడప జిల్లాలో కొవిడ్ కేసు నమోదైందంటూ శుక్రవారం వార్తలు వచ్చాయి. నంద్యాల జిల్లాకు చెందిన మహిళకు కొవిడ్ సోకిందని .. కడప రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై కడప డీఎంహెచ్వో స్పందించారు. అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇచ్చారు.