ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. సుమారుగా ఆరున్నర లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాస్తున్నారు. ఈ నెలాఖరు వరకూ పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఇక పరీక్షలు రాస్తున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో పరీక్షా కేంద్రాల వద్ద కోలాహలం నెలకొంది. అయితే నంద్యాల జిల్లాలో జరిగిన ఓ ఘటనను ఓ నెటిజన్ మంత్రి నారా లోకేష్ దృష్టికి తెచ్చారు. కొంత మంది అధికారులకు అసలు మానవత్వం ఉండదా అంటూ ఈ ఘటనపై నారా లోకేష్కు ఫిర్యాదు చేశారు. దీంతో మంత్రి నారా లోకేష్ క్షమాపణలు తెలియజేశారు.