Tdp Mla Vasantha Krishna Prasad Tears: ఎన్టీఆర్ జిల్లా మైలవరం టీడీపీ ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ కన్నీటిపర్యంతం అయ్యారు. తన వ్యక్తిగత కార్యదర్శి కట్టా నరసింహరావు ఆకస్మికంగా మరణించడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. నరసింహరావు మృతదేహాన్ని చూసి ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు నరసింహరావుకు నివాళులర్పించి, ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటని అన్నారు.