తిరుపతిలోని కపిలతీర్థం ఆలయానికి భారీ విరాళం అందింది. తిరుమలకు చెందిన నరహరి అనే భక్తుడు కపిలతీర్థంలోని కామాక్షి అమ్మవారికి వెెండి ఆభరణాలు బహూకరించారు. 9 కేజీల వెండిని ఉపయోగించి, సుమారుగా 9 లక్షలు ఖర్చు చేసి వీటిని తయారు చేయించారు. మొత్తం 12 ఆభరణాలను టీటీడీ సిబ్బందికి అందజేశారు. ఈ సందర్భంగా టీటీడీ సిబ్బంది విరాళం అందించిన దాతను శాలువాతో సత్కరించి, స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మరోవైపు ఈ నెలలోనే కపిలతీర్థం బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.