కరీంనగర్ దంపతుల బూతు బాగోతం కలకలం రేపుతోంది. వ్యాపారంలో నష్టాలు రావడంతో అడ్డదారులు తొక్కిన వీరు.. హనీ ట్రాప్తో అమాయకులను వల వేసి లక్షలాది రూపాయలు దండుకున్నారు. సోషల్ మీడియాలో పరిచయాలు పెంచుకుని, రహస్య కెమెరాలతో రికార్డ్ చేసి, బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేశారు. వీరి వలలో సుమారు 50 మందికి పైగా చిక్కినట్లు సమాచారం.