ఓ వ్యక్తి అత్యాశ, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఒక ముఠా భారీ మోసానికి పాల్పడింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా శ్రీరాములపల్లిలో చోటు చేసుకుంది. ఇంట్లో బంగారం ఉందని నమ్మబలికి, పూజల పేరుతో గజ్జి ప్రవీణ్ అనే వ్యక్తి నుంచి రూ.15 లక్షలు వసూలు చేసి పత్తా లేకుండా పోయారు. మోసాన్ని గ్రహించిన ప్రవీణ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నిందితులను అరెస్ట్ చేశారు. ఇలాంటి నకిలీ స్వాముల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.