విద్యుత్ కనెక్షన్ కావాలంటే ఇకపై కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదంటున్నారు ఏపీ విద్యుత్ శాఖ అధికారులు. ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ తాజా సంస్కరణలతో విద్యుత్ కనెక్షన్లు పొందడం ఇక సులభతరమవుతుందని చెప్తున్నారు. అలాగే అదనపు ఛార్జీల భారం కూడా వినియోగదారులపై ఉండదంటున్నారు. అలాగే విద్యుత్ అదనపు లోడ్ కోసం కూడా స్థిర ఛార్జీలు నిర్ణయించినట్లు చెప్తున్నారు.