దేశంలోనూ కొవిడ్-19 కేసులు స్వల్పంగా పెరుగుతున్నాయి. మే 12 నుంచి వారం వ్యవధిలోనే 164 కొత్త కేసులు నమోదయ్యాయి, ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, తమిళనాడులో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. గాంధీ ఆసుపత్రిలో 30 పడకల కోవిడ్ వార్డును ఏర్పాటు చేశారు. అనవసర ఆందోళన అవసరం లేదని అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితి నియంత్రణలోనే ఉందని భారత ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.