కర్ణాటకకు తరలిపోతున్న తెలంగాణ వడ్లు, పత్తి.. కారణం ఇదే..

6 months ago 17
జోగులాంబ గద్వాల జిల్లాలో రైతులు పండించిన ధాన్యం, పత్తి పంటలకు కర్ణాటకలో అధిక ధరలు లభిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం మద్దతు ధర (ఏ-గ్రేడ్ రూ. 2,389) ప్రకటించినప్పటికీ.. కర్ణాటక వ్యాపారులు క్వింటాలుకు రూ. 2,700–రూ. 3,000 వరకు చెల్లిస్తున్నారు. రైతులు రవాణా ఖర్చు ఆదా అవుతుండటంతో.. కొనుగోలు కేంద్రాలకు కాకుండా నేరుగా వ్యాపారులకు అమ్ముతున్నారు. ఫలితంగా.. రెండు లక్షల మెట్రిక్ టన్నులు అంచనా వేసినా, ఇప్పటివరకు కేవలం 9 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు కేంద్రాలకు చేరింది. పత్తి విషయంలో సీసీఐ కొర్రీలు పెడుతుండటంతో.. రైతులు అటువైపే మొగ్గు చూపుతున్నారు.
Read Entire Article