ఉమ్మడి కర్నూలు జిల్లాలో సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసు కలకలం రేపుతోంది. నెల రోజుల క్రితమే వివాహం చేసుకున్న తేజేశ్వర్ జూన్ 17 నుంచి కనిపించకుండా పోయాడు. పాణ్యం సమీపంలోని పిన్నాపురం చెరువు వద్ద అతని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అయితే బ్యాంక్ మేనేజర్ తిరుమలరావు, యువతి తల్లి కలిసి పథకం ప్రకారం తేజేశ్వర్ను హత్య చేసినట్లు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.