Kurnool Blood Tulabharam: కర్నూలు జిల్లా కౌతాళంలో వినూత్నంగా స్వామీజీకి రక్తంతో తులాభారం నిర్వహించారు. మహంతేశ్వర స్వామి ఆరాధనోత్సవాల్లో భాగంగా జరిగిన రక్తదాన శిబిరంలో 700 మంది భక్తులు రక్తదానం చేశారు. భక్తులు ఇచ్చిన రక్తాన్ని పీఠాధిపతికి అందజేయగా, రాత్రికి రక్తదాన ప్యాకెట్లతో ఆయనకు తులాభారం వేశారు. ఈ కార్యక్రమానికి పలువురు పీఠాధిపతులు హాజరయ్యారు. మరోవైపు శ్రీశైలంలో భ్రమరాంబాదేవికి కుంభోత్సవం వైభవంగా జరిగింది. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, నిమ్మకాయలు, కొబ్బరికాయలు సమర్పించారు.