Kurnool Farmer Get Rs 1.22 Lakhs: కర్నూలు జిల్లాకు చెందిన రైతు పెద్ద అంజినయ్య ఎకరం పొలంలో అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేసి అద్భుత ఫలితాలు సాధించారు. తక్కువ పెట్టుబడితో 19.2 క్వింటాళ్ల దిగుబడి సాధించి రూ.87 వేల నికర ఆదాయం పొందారు. ఈయన కృషికి గుర్తింపుగా తమిళనాడులో జరిగిన జాతీయ సదస్సులో కేంద్ర మంత్రుల చేతుల మీదుగా జాతీయ పురస్కారం అందుకున్నారు. అంజినయ్య ఎంతోమంది రైతులకు ఆదర్శంగా నిలిచారు.