ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. కర్నూలులో బంగారు గనిని వచ్చే నెలలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇది అందుబాటులోకి వస్తే దేశంలో ఉత్పత్తి అయ్యే బంగారంలో సగం మనదగ్గరే తయారు చేయవచ్చన్నారు చంద్రబాబు. మరోవైపు కర్నూలు జిల్లా జొన్నగిరిలో దేశంలోని మొదటి ప్రైవేట్ గోల్డ్ మైన్ కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. చంద్రబాబు వ్యాఖ్యల నేపథ్యంలో జూన్ నెలలో దీనిని ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.