తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టల్లో గత ఆరు రోజులుగా కేంద్ర బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఈ ఘటనలో 38 మంది మావోయిస్టులు మరణించినట్లు సమాచారం. భద్రతా దళాలు ఒక భారీ సొరంగాన్ని గుర్తించాయి. దీనిలో వెయ్యి మంది తలదాచుకునే అవకాశం ఉంది. డీహైడ్రేషన్, ఆహార కొరతతో మావోయిస్టులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ముగ్గురు మహిళా మావోయిస్టుల మృతదేహాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.