ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రెండు రోజుల పాటు జిల్లా కలెక్టర్ల సదస్సు నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్వహించిన ఆరో సదస్సు ఇది. ఇందులో రాష్ట్ర మంత్రులు, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు సహా కీలక అంశాలపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా చివర రోజున సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. అధికారులకు కీలక సూచనలు చేశారు.