తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏపీ సీఎం చంద్రబాబు అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ వ్యవహారంపై ఏపీ అసెంబ్లీలో లఘు చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలు తయారు చేశారని ఆరోపించారు. తప్పులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సిట్ రిపోర్టు పంపించిందన్న చంద్రబాబు.. అందుకే ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశామన్నారు. మరోవైపు దోషులు ఎవరైనా శిక్ష పడాలని పవన్ కళ్యాణ్ కోరారు.