మాజీ ఇంజనీర్ ఇన్ చీఫ్ సి. మురళీధర్రావును ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు మంగళవారం అరెస్ట్ చేశారు. హైదరాబాద్తో పాటు 11 ప్రాంతాల్లో నిర్వహించిన సోదాల్లో రూ. 500 కోట్లకు పైగా అక్రమాస్తులు బయటపడ్డాయి. ఇందులో మోకిలలో 1.5 ఎకరాల స్థలం, 11 ఎకరాల పొలం, పలు విల్లాలు, ఫ్లాట్లు, వాణిజ్య సముదాయాలు, ఒక సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఉన్నాయి.