కల్వకుంట్ల కవిత తన నూతన రాజకీయ పార్టీకి 'తెలంగాణ ప్రజా జాగృతి' అనే పేరును ఖరారు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. దరఖాస్తులో లోపాలున్నట్లు ఈసీ వెల్లడించింది. కాగా, కొత్త పార్టీతో క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై పోరాడేందుకు కవిత సిద్ధమవుతున్నారు.