టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతో మాజీ మంత్రి బోడ జనార్ధన్ భేటీ అయ్యారు. తొందర్లనో టీఆర్ఎస్ పార్టీలో తన అనుచరులతో కలిసి చేరనున్నట్లు భేటీ తర్వాత బోడ జనార్థన్ వెల్లడించారు. ఇప్పటికే పార్టీ పెట్టడానికి ముందే మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు.. కవితకు మద్దతు ప్రకటించారు. వరుసగా ఇతర పార్టీల నుంచి నేతలు చేరడంతో కవిత పార్టీ శ్రేణులకు సరికొత్త ఉత్సాహం నెలకొంది.