బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతో అనుముల ఇంటెలిజెన్స్ రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తోందని ఆరోపించారు. కులగణనను తప్పుదోవ పట్టించి బీసీలకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధమైతే.. బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని న్నారు.