ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న సీఎల్పీ మీటింగ్ వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న సీఎల్పీ భేటీకి వారు చివరి నిమిషయంలో దూరమయ్యారు. పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇటీవలే అసెంబ్లీ సెక్రటరీ వారికి నోటీసులు జారీ చేయగా.. ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నందున సమావేశానికి వెళ్లొద్దని నిర్ణయం తీసుకున్నారు.