గద్వాల మాజీ జడ్పీ ఛైర్మన్, కాంగ్రెస్ పార్టీ మహిళా నేత సరితా తిరుపతయ్యకు కీలక పదవి దక్కే ఛాన్స్ ఉంది. ఆమెను రాష్ట్ర మహిళా కాంగ్రెస్ విభాగం అధ్యక్షురాలిగా నియమించాలని సీఎం రేవంత్ భావిస్తున్నారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని గాంధీ భవన్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.