Yanam Pulasa Fish Huge Rate: ఉభయ గోదావరి జిల్లాల్లో పులస సందడి మొదలైంది! గోదావరికి ఎర్రనీరు రావడంతో మత్స్యకారులు వేట ప్రారంభించారు. ఈ సీజన్లో ఒక కిలో పులస చేప రూ.15 వేలకు అమ్ముడుపోయింది. దీనిని బట్టి పులసకు ఉన్న డిమాండ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఐతే, పులసల ఉత్పత్తి తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ చేపల రాకతో యానాం మార్కెట్ కళకళలాడుతోంది. ఇంతకీ ఈ పులస ప్రత్యేకత ఏంటి?