Kakinada Fish Bone Rare Surgery: తూర్పుగోదావరి జిల్లాలో జంగాయమ్మ అనే మహిళ చేపల కూర తింటుండగా పొరపాటున ముల్లు మింగింది. ఛాతిలో నొప్పి రావడంతో ఆసుపత్రికి వెళ్లగా, ముల్లు గుండె రక్తనాళానికి గుచ్చుకున్నట్లు గుర్తించారు. వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేసి తొడ ద్వారా రంధ్రం చేసి ముల్లును తొలగించారు. తెలుగు రాష్ట్రాల్లో ఇది మొదటిసారి కాగా, దేశంలో రెండోసారి అని వైద్యులు తెలిపారు. బాధితురాలు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.