ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో విదేశీ జండాల ప్రదర్శన కలకలం సృష్టించింది. కొందరు యువకులు కార్లలో పాలస్తీనా జండాలు ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించడం వివాదాస్పదంగా మారింది. రెండు రోజుల క్రితం.. మిలాద్ ఉన్ నబీ వేడుకల్లో భాగంగా కొందరు యువకులు పాలస్తీనా జండాలతో ర్యాలీ నిర్వహించడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ముస్లిం మత పెద్దలు సైతం దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.