కాచిగూడ- చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. భయపడిపోయిన ప్రయాణికులు

1 year ago 32
కాచిగూడ నుంచి చెన్నై వెళ్తున్న చెన్నై ఎక్స్‌ప్రెస్‌ రైల్లో పొగలు రావడం కలకలం రేగింది. గద్వాల రైల్వే స్టేషన్‌‌కు రైలు చేరుకున్న సమయంలో బీ4 బోగీ కింది భాగంలో దట్టమైన పొగలు వ్యాపించాయి. దీంతో అప్రమత్తమైన రైల్వే అధికారులు.. వెంటనే రైలు నిలిపివేసి ప్రయాణికులకు కిందకు దింపేశారు. ఈ ఘటనతో ఒక్కసారిగా ప్రయాణికులు భయపడిపోయారు. ఏం జరుగుతుందో తెలియక ఆయోమయానికి గురయ్యారు. అనంతరం కొద్దిసేపటి తర్వాత మరమ్మతులు చేయడంతో ప్రయాణికులతో రైలు బయలుదేరింది. అయితే, పొగలు రావడానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. దీనిపై అధికారులు ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు.
Read Entire Article