ఢిల్లీ లిక్కర్ కేసులో సీబీఐ నోటీసులు ఇవ్వడంపై కల్వకుంట్ల కవిత స్పందించారు. సీబీఐ అధికారులు ఇచ్చిన నోటీసులపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు వెల్లడించారు. సత్యం తన వెంట ఉన్నంత వరకు తాను సీబీఐ అధికారులకు పూర్తిగా సహకరిస్తానని తేల్చి చెప్పారు. ఇక ఈ వ్యవహారంలో ఈనెల 16వ తేదీన విచారణకు హాజరు కావాలని సీబీఐ అధికారులు కవితకు నోటీసులు ఇచ్చారు.