ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకంలో విరిగిన పాలతో అభిషేకం జరిగిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈ విషయం సంచలనంగా మారింది. అయితే, ఆలయ అధికారులు ఇది అసత్య ప్రచారమని కొట్టిపారేశారు. టెండరుదారుడు, భక్తుల మధ్య పాల విషయంలో వాగ్వాదం జరిగిందని, విరిగిన పాలు గర్భగుడిలోకి వెళ్లలేదని వారు స్పష్టం చేశారు. భక్తులు అపోహలు నమ్మవద్దని, ఆలయంలో ఎలాంటి అపచారం జరగలేదని అధికారులు తెలిపారు.