కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి వచ్చే భక్తులకు అధికారులు కీలక సూచన చేశారు. వీఐపీ దర్శనం టికెట్ ధరను రూ.300 లకు పెంచాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన అనుమతి కోసం కమిషనర్కు ప్రతిపాదనలు పంపారు. సిఫార్సులతో వచ్చే భక్తులకు ఇకపై టికెట్ తప్పనిసరి అని, ఆలయ ఉద్యోగులు కూడా టికెట్లు కొనుగోలు చేయాలని ఈవో పెంచల కిషోర్ తెలిపారు. వేసవి సెలవుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు.