నిజామాబాద్లో గంజాయి ముఠాను అడ్డుకునే క్రమంలో ఏఆర్ కానిస్టేబుల్ సౌమ్యపై దాడి జరిగింది. తీవ్రంగా గాయపడిన సౌమ్యను మంత్రి జూపల్లి కృష్ణారావు పరామర్శించి, ఆమె వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. విధి నిర్వహణలో భాగంగా సౌమ్య చూపిన తెగువ ప్రశంసనీయం అన్నారు. అదేవిధంగా విధి నిర్వహణలో ఉన్న అధికారులపై దాడులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఎక్సైజ్ అధికారులకు ఆయుధాలు ఇచ్చే అంశం పరిశీలనలో ఉందని మంత్రి తెలిపారు.