కామారెడ్డి: పెద్దపులి సంచారం.. భయంతో వణికిపోతున్న స్థానికులు

8 months ago 17
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం స్కూల్ తండాలో పెద్దపులి సంచారం స్థానిక ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. తాజాగా ఓ రైతుకు చెందిన ఆవుపై ఎస్-12 అనే పెద్దపులి దాడి చేసింది. గతంలోనూ ఇక్కడ పులుల సంచారం ఉండటంతో ప్రజలు నెలల తరబడి భయంలో గడిపారు. ప్రస్తుతం పగటిపూట కూడా బయటకు వెళ్లడానికి జంకుతున్నారు. అటవీ శాఖ సిబ్బంది అప్రమత్తమై గాలింపు చర్యలు చేపట్టి, ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. రైతులు, పశువుల కాపరులు ఒంటరిగా అడవిలోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Read Entire Article