5జీ, 6జీ అంటూ టెక్నాలజీ పరుగులు పెడుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటూ ప్రపంచం మొత్తం ఏఐ మీద ఆధారపడిపోతోంది. మానవ మేధస్సు సృష్టికి ప్రతిసృష్టి చేసేంత మేథో సంపత్తిని సంపాదించుకుంటోంది. అయితే ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే.. మరోవైపు చేతబడి, బాణామతి, బ్లాక్ మాజిక్ అంటూ తాంత్రిక, క్షుద్రపూజలు కూడా జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ వట్టి అబద్ధాలంటూ జనవిజ్ఞాన వేదిక వంటి సంస్థలు ప్రచారం, అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాసరే.. మోసాలు జరుగుతూనే ఉన్నాయి.. దీనికి కారణం ఆశ.. ఆ ఆశతోనే పది లక్షలు మోసపోయిన వైనం తాజాగా గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.