ఉద్యోగి మరణించినా లేదా అనారోగ్యంతో పదవీ విరమణ చేసినా కారుణ్య నియామకాలు చేపడతారనే విషయం తెలిసిందే. అయితే కారుణ్య నియామకాల దరఖాస్తులను తిరస్కరించే ముందు.. వారి కుటుంబ ఆర్థిక ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోవాలని ఏపీ హైకోర్టు చెప్పింది. దరఖాస్తులను మానవీయ కోణంలో పరిశీలించాలని వాఖ్యానించింది. ఓ కేసులో ఐదేళ్ల ఆలస్యం అసాధారణం కాదని.. పిటిషనర్ దరఖాస్తును 3 నెలల్లోగా పరిశీలించాలని రైల్వే అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగి మరణించిన తర్వాత వారి కుటుంబం ఆర్థిక ఇబ్బందులో మునిగిపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేసింది.