కారుణ్య నియామకాలపై మంత్రి కీలక ప్రకటన.. ప్రతి మూడు నెలలకూ..

1 month ago 8
ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక ప్రకటన చేశారు. విద్యుత్ శాఖలో ప్రతి మూడు నెలలకు ఒకసారి కారుణ్య నియామకాల ప్రక్రియ చేపడుతున్నట్లు తెలిపారు. శుక్రవారం రోజున ఏపీ జెన్కో పరిధిలో 27 మందికి కారుణ్య నియామక పత్రాలను మంత్రి గొట్టిపాటి అందించారు. ఈ సందర్భంగా ఏపీలోని టీడీపీ కూటమి ప్రభుత్వం విద్యార్హతలకు అనుగుణంగా ఉద్యోగాలు కల్పిస్తూ బాధిత కుటుంబాల భరోసా ఇస్తోందని మంత్రి వివరించారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో వయసు నిబంధనలలో సడలింపులు తీసుకువచ్చి, ప్రతి మూడు నెలలకు ఒకసారి కారుణ్య నియామకాలు చేపడుతున్నట్లు మంత్రి వివరించారు.
Read Entire Article