సమాజంలో మోసాలు ఎలా జరుగుతున్నాయి, మోసగాళ్లు ఏ స్థాయికి దిగజారారో తెలియజేసే ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. కృష్ణా జిల్లా పెనమలూరు మండలంలో ఈ ఘటన జరిగింది. పెనమలూరు మండలానికి చెందిన ఓ యువతి విజయవాడలోని ఓ కాలేజీలో చదువుతోంది. అదే కాలేజీలో చదివే యువకుడు, ఆ యువతికి పరిచయమయ్యాడు. అక్కా అని పిలుస్తూ.. చనువు పెంచుకున్నాడు. మంచోడు, మనోడని నమ్మిన ఆ యువతి.. ఆ యువకుణ్ని ఇంటికి తీసుకెళ్లింది.. ఇంట్లో వారికి కూడా పరిచయం చేసింది.. కానీ ఆ తర్వాతే అతగాడి నిజరూపం తెలిసింది..