కాళేశ్వరం ప్రాజెక్ట్లో అవకతవకలపై విచారణ తుది దశకు చేరిన వేళ, ఈఎన్సీ హరిరామ్ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. నేడు తెల్లవారుజాము నుంచి షేక్పేట్లోని ఆదిత్య టవర్స్లోని హరిరామ్ నివాసంతో పాటు మొత్తం 14 చోట్ల రెయిడ్లు కొనసాగుతున్నాయి. గజ్వేల్ ప్రాంతంలో 30 ఎకరాల భూమి పత్రాలు, 3 బ్యాంక్ లాకర్లు బయటపడ్డాయి. హరిరామ్ ప్రస్తుతం కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీగా ఉన్నారు.