కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. దాదాపు 50 నిమిషాల పాటు ఇన్కెమెరా పద్ధతిలో ఈ విచారణ జరిగింది. ఈ వ్యవహారంలో 115వ సాక్షిగా హాజరైన కేసీఆర్ను కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, నిర్ణయాలు, నీటి వినియోగంపై ప్రశ్నించారు.